బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:39 IST)

జ్యూయలరీ వీక్‌లో కనువిందు చేయనున్న సానియా మీర్జా

ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్ గెలుచుకుని కెరీర్‌లో అద్భుత ఘనతకెక్కిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే భర్త షోయబ్ మాలిక్ కోసం సానియా శ్రీలంకకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఆట విడుపుగా మోడలింగ్ ర్యాంప్‌పై వాక్ చేసే సానియా మీర్జా.. తాజాగా మరో ప్రోగ్రామ్‌లో పాల్గొననుంది. 
 
కాగా, ఆగస్టు 3న ముంబయిలో జరిగే 'ది ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్' లో సానియా తళుకుబెళుకులు ప్రదర్శించనుంది. ఈ షోలో సానియా... మోనీ అగర్వాల్ డిజైన్ చేసిన 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ధరించి కనువిందు చేయనుంది. ప్రపంచంలోని అత్యద్భుతమనదగ్గ పుష్పాలను తలపించేలా ఈ నగలను మోనీ అగర్వాల్ డిజైన్ చేశారు.