గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (11:10 IST)

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : స్వీటీకి, సర్జుబాలాకు రజతాలు!

ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. 48 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి సర్జుబాల ప్రపంచ మూడో ర్యాంకర్ నేజిమ్ కజిబేవ్ (కజకిస్థాన్) మట్టికరిపించింది. 
 
81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ... యాంగ్ జియోలి (చైనా) చేతిలో ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కేవలం ఒక్క కాంస్యం మాత్రమే లభించింది. ఈసారి రెండు రజతాలు లభించడం భారత్‌కు మెరుగైన ప్రదర్శన. ఈ సారి భారత్ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది.