ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ : హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభం
ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ ముందుండి నడిపిస్తున్న ఈ లీగ్లో నగరానికి చెందిన హైదరాబాద్ ఏసెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాజీ ప్రపంచ నెంబర్వన్ మార్టినా హింగిస్, మార్క్ ఫిలిప్ఫోసిస్, మైకేల్ యాజ్నీ, బాగ్ధాటిస్, రద్వాన్స్కా లాంటి స్టార్ క్రీడాకారులతో హైదరాబాద్ ఏసెస్ కళకళలాడుతోంది. ఈ లీగ్ కోసం ఆదివారం ఎల్బీ స్టేడియంలో హింగిస్ నెట్ ప్రాక్టీస్ చేసింది.
ఈ లీగ్లో హైదరాబాద్ ఏసెస్తో పాటు పంజాబ్ మార్షల్స్, బెంగళూరు రాప్టర్స్, దిల్లీ డ్రీమ్స్, ముంబయి టెన్నిస్ మాస్టర్స్, పుణె మరాఠాస్ జట్లు పోటీలో ఉన్నాయి. తొలి మ్యాచ్లో పంజాబ్తో ఢిల్లీ, హైదరాబాద్తో బెంగళూరు తలపడనున్నాయి.