గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (11:08 IST)

ఐపీఎల్‌లో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం మనదే: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తిడికి లోనుకాకుండా ఏ జట్టయితే పరుగులు సాధించగలుగుతుందో ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని కోహ్లీ తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఎలా ఆడాలో అలా టీ-20ల్లో తొలి ఓవర్ నుంచే ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో స్లాగ్ ఓవర్ల ఒత్తిడి ఆటగాళ్లపై పని చేయదని తెలిపాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉందని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు ఐపీఎల్ సీజన్-10 జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.