కృష్ణుని జన్మదినమైన కృష్ణాష్టమి ఆదివారం వేళ వస్తే ఎంతో శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది కృష్ణాష్టమి ఆదివారం వస్తుండడం భక్తులకు చాలా ఆనందాన్ని కల్గిస్తోంది.ఇలాంటి శుభప్రదమైన వేళ ప్రత్యేక పూజలతో కృష్ణుని సేవిస్తే ఆ లీలా మానస చోరుడు తప్పక అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేళ మద్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాలు రెండింటిని పూజకు ఉపయోగించాలి.