శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:07 IST)

కుమార్తెతో వ్యభిచారం చేయించిన తల్లి : బాలిక బావ సహకారంతో...

హైదరాబాద్ పాతబస్తీలో చీకటి కోణంలో అనేక అకృత్యాలు, అరాచకాలు జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా పాతబస్తీ యాకుత్‌పురాలో 15 యేళ్ల బాలికతో ఆమె తల్లి వ్యభిచారం చేయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనికి బాలిక బావ (తల్లి సోదరుడు) కూడా తన వంతు సహకారం అందిస్తూ వచ్చాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
యాకుత్పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావతో కలిసి జీవిస్తోంది. వీరికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో తన సోదరుడు ఇచ్చిన సలహా మేరకు.. తల్లి తన 15 యేళ్ళ కుమార్తెతో బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించింది. దీనికి సోదరుడు తన వంతు సాయం చేస్తూ వచ్చాడు. ఆ యువతిని విటుల ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి, ఇంటికి సురక్షితంగా తీసుకొచ్చేవాడు. 
 
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది. తనను చాలా కాలంగా ఫాంహౌస్లు, హోటళ్లకు పంపుతున్నారని, పుణె, బాంబే, గోవా.. ఇలా అనేక ప్రాంతాల్లో తనతో వ్యభిచారం చేయించారని బాలిక వాపోయింది. 
 
ఇంటికి వెళ్తే చంపేస్తారని కూడా బాలిక చెపుతోంది. రెండు రోజుల క్రితం గోవా పంపగా, అక్కడి నుంచి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పాతబస్తీకి చేరుకున్నట్టు తెలిపింది. ఇంటి నుంచి 5 గంటల సమయంలో పారిపోయి బయటకు రాగలిగింది. దుబాయ్ షేక్ల వద్దకు కూడా తనను పంపుతున్నారని ఆమె వాపోయింది. అయితే, బాధితురాలి తరపు నుంచి ఫిర్యాదు లేక పోవడంతో పోలీసులు కూడా మిన్నకుండి పోయారు.