శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:08 IST)

ఆదర్శ రైతుల్లా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుండాలి: ఎర్రబెల్లి

ఇజ్రాయెల్‌లో జరుగనున్న అగ్రికల్చర్ సంబంధ ఎగ్జిబిషన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఎమ్మెల్యేలను పంపడంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కారు పలువురు ఎమ్మెల్యేలను పంపించడంపై ఎర్రబెల్లి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఏనుగు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, కమలాకర్, మనోహర్ రెడ్డిలు ఇజ్రాయెల్ వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
వాళ్లు ఆదర్శ రైతులు కారని, ఆ ముసుగులో ఇజ్రాయెల్ వెళ్లి వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు యత్నిస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. కమలాకర్‌కు మైనింగ్ వ్యాపారం ఉందని, విద్యాసాగర్ రావుకు 'రియల్' బిజినెస్ ఉందని వివరించారు. ఆదర్శ రైతుల్లా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుండాలని అన్నారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజు కూలీ రూ.180కు పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కూలీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానుంది.