శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (18:49 IST)

అతని రూమ్‌కు వెళ్లి మూడు రాత్రులు గడిపింది... నిజం చెప్పేశాడు... ఆ తరువాత?

ప్రియుడే సర్వస్వమని నమ్మింది. అన్నీ అర్పించింది. చివరకు ప్రియుడికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుని షాకయ్యింది. హైదరాబాదులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ లోని ఒక లేడీస్ హాస్టల్‌లో హెబ్సికారాణి, ప్రత్యూషలు ఉంటున్నారు. ఇద్దరూ ఎంబిబిఎస్ చదువుతున్నారు. హెబ్సికారాణి తల్లి, దండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఫాస్టర్ బెన్ హాం హెబ్సికారాణికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఆయన హెబ్సికాను తన కుమార్తెలా భావించేవాడు. ఎంబిబిఎస్ చదువుతున్న హెబ్సికా, ప్రత్యూషలు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రత్యూష నగేష్‌ను ప్రేమించగా, హెబ్సికా రాణి ఆంజనేయులు ప్రేమించింది. నగేష్‌‌తో ప్రత్యూష కమిటైంది. పెళ్ళి చేసుకుందామని నగేష్‌ చెప్పడంతో అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. 
 
నగేష్‌‌తో తాను చనువుగా ఉన్న క్షణాలను ప్రత్యూష తన స్నేహితురాలు హెబ్సికారాణికి  చెప్పింది. దీంతో హెబ్సికా కూడా తన ప్రియుడితో కలవడం మొదలుపెట్టింది. అతని రూమ్‌కు వెళ్లి మూడు రాత్రులు గడిపింది. ఆ తరువాత మెల్లగా హెబ్సికాతో మాట్లాడటం మానేశాడు ఆంజనేయులు. పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది హెబ్సికా. అది సాధ్యం కాదంటూ కువైట్‌కు వెళ్ళిపోయాడు. అయినాసరే ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఈరోజు, రేపు అంటూ నాన్చుతూ వచ్చిన ఆంజనేయులు ఒకరోజు సడెన్‌గా హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో హెబ్సికా అతన్ని కలిసింది.
 
ఈసారి ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలంది. దీంతో ఆంజనేయులు అసలు విషయం చెప్పేశాడు. తనకు ఆరు సంవత్సరాల క్రితమే వివాహమైందని, తనభార్య, పిల్లలిద్దరూ కరీంనగర్‌లో ఉంటారని చెప్పాడు. దీంతో హెబ్సికా షాకయ్యింది. ప్రియుడు తనను మోసం చేశాడని తెలుసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు ఆంజనేయులు పరారీలో ఉన్నాడు.