గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: శనివారం, 12 జులై 2014 (17:57 IST)

తెలంగాణాకు ఎయిమ్స్ తరహా ఆసుపత్రి... డిప్యూటీ సీఎం రాజయ్య

ఎంబిబిఎస్‌ ఫీజులు, కౌన్సెలింగ్‌ తేదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దే తుది నిర్ణయం అన్నారు డిప్యూటీ సీఎం డాక్టర్‌ రాజయ్య. ఈ ఏడాది ఫీజులు పెంచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణకు ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు రాజయ్య.