గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2015 (18:48 IST)

రజినీకాంత్ సినిమాలో మాత్రమే ఇది సాధ్యం : ఎంపీ అసదుద్ధీన్

వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అసదుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. చేతులకు సంకెళ్లు ఉండగా రైఫిళ్లు ఎలా లాక్కుంటారు. ఇలాంటివి రజినీకాంత్ సినిమా మాత్రమే సాధ్యం అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. సీఎం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
 
ఇంకా మాట్లాడుతూ.. ఆలేరు ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌పై హైకోర్డు జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ముస్లింలు భయాందోళనలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. సూర్యాపేట ఘటనను కూడా తాము ఖండిస్తున్నామని, చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా సీఎంను కోరామని అసదుద్దీన్ చెప్పారు.