బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (08:11 IST)

'కాల్చి పారేస్తా'నంటూ టీడీపీ నేతపై గన్ ఎక్కుపెట్టిన కరీంనగర్ జైలు సెంట్రీ

జైల్లో ఉన్న తమ నేతను చూసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలపై సెంట్రీ (గార్డు) తుపాకీ ఎక్కుపెట్టారు. జైలు ప్రవేశద్వారం తలుపులు తాకితే తుపాకీతో కాల్చిపారేస్తానంటూ బెదిరించడమే కాకుండా, వారికి తుపాకీ ఎ

జైల్లో ఉన్న తమ నేతను చూసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలపై సెంట్రీ (గార్డు) తుపాకీ ఎక్కుపెట్టారు. జైలు ప్రవేశద్వారం తలుపులు తాకితే తుపాకీతో కాల్చిపారేస్తానంటూ బెదిరించడమే కాకుండా, వారికి తుపాకీ ఎక్కుపెట్టాడో సెంట్రీ. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయ రమణారావును మంగళవారం కోర్టు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వచ్చారు. జైలులో ఉన్న విజయరమణారావును కలిసేందుకు రేవంత్‌తోపాటు పలువురు నాయకులు ముందుగానే అనుమతి తీసుకుని లోనికి వెళ్లారు.
 
పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం కూడా లోనికి వెళ్తుండగా సెంట్రీ  అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సెంట్రీ తనవద్దనున్న తుపాకీ ఎత్తి కాల్చివేస్తానని బెదిరించాడు. కార్యకర్తలు, పోలీసులు ఇద్దరిని దూరంగా తీసుకుపోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.