మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (11:58 IST)

మేం ఆంధ్రోళ్లమా.. తెలంగాణ అసెంబ్లీలో కడిగేసిన లేడీ టైగర్..!?

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ ప్రవేశం చేసిన సంగతి మీడియా అంతా ధూంధాంగా చూపించారు. ఆ గ్రామస్తులు ఏకంగా కేసీఆర్ ఫోటోనే దేవుడి ఫోటోగా ఇళ్లలో పెట్టుకున్నారు. ఇక మీడియాలో ఈ గృహ ప్రవేశం కార్యక్రమం బ్రహ్మాండంగా హైలెట్ అయ్యింది.  
 
కానీ.. రాష్ట్రంలో కొన్ని లక్షల పేదలు ఉండగా.. కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోనే పేదలు ఉన్నట్టు.. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించగానే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించినట్టు మీడియాలో ఫోకస్ కావడమే దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అసెంబ్లీలో నిలదీసింది. 
 
కేసీఆర్ నియోజకవర్గంలో, హరీశ్ రావు నియోజకవర్గాల్లో ఇళ్లుకడితే సరిపోయిందా అంటూ నిలదీసింది. మేం మీలాగే ప్రజలతో ఎన్నుకోబడలేదా.. మేం ఎమ్మెల్యేలం కామా.. మేమేమైనా ఆంధ్రోళ్లమా.. మా పల్లెల్లో డబుల్ బెడ్రూము ఇళ్లు వద్దా అంటూ డీకే అరుణ ప్రశ్నించింది.