శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (15:00 IST)

గాంధీ భవన్‌లో డీఎస్, కేకే, బొత్స ఫోటోలను పీకి చెత్తబుట్టలో వేసిన వీహెచ్

హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఉన్న పీసీసీ మాజీ చీఫ్‌లు డి.శ్రీనివాస్, కె కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫోటోలను టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆదివారం పీకిపారేశారు.
 
ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వీరిలో కేకే తెరాసలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే, డి శ్రీనివాస్ నేడోరేపో తెరాసలో చేరనున్నారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల వైకాపాలో చేరిన విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన వీహెచ్, దామోదర్ రెడ్డి ఆ ముగ్గురి ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్‌లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వీహెచ్, దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటివారి ఫోటోలు గాంధీ భవన్‌లో ఉండటానికీ వీలులేదని వారు తేల్చిచెప్పారు.