మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:01 IST)

దాశరథి స్మారక పురస్కారం.. రూ.1,00,116 నగదు!

ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ప్రారంభించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ప్రతి సంవత్సరం దాశరథి పురస్కారం పేరిట రూ.1,00,116 అందజేసి సన్మానిస్తామని తెలిపారు. 
 
దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాశరథి పేరిట కేసీఆర్ ప్రకటించిన మరికొన్ని అంశాలు.. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయం లేదా తెలంగాణాలోని ఓ విద్యాసంస్థకు దాశరథి పేరు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.