శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (18:34 IST)

కేసీఆర్ బిర్యానీ పెడుతున్నారని అమిత్ షాకు కుళ్లెందుకు?: ఓవైసీ

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ సెటైర్లు విసిరారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బిర్యానీ పంపిస్తున్నారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్ధీన్ కౌంటరిచ్చారు. ఇతరులు బిర్యానీ తింటుంటే.. ఎందుకంత కడుపు మంటా? అంటూ నిలదీశారు. 
 
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారనే విషయాన్ని గుర్తు చేసిన ఓవైసీ.. ఆ ఫంక్షన్‌లో ఏం పెట్టారా తెలియదా అంటూ ప్రశ్నించారు. అమిత్ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదన్నారు. 
 
ఒకవేళ తెలిసివుంటే అప్పుడే కళ్యాణీ బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినని ఓవైసీ అన్నారు. కేసీఆర్ బిర్యానీ పెట్టలేదని అమిత్ షా కుళ్లుకుంటున్నారని.. ఈసారి కచ్చితంగా అమిత్ షాకు కళ్యాణీ బిర్యానీ పార్సిల్ పంపిస్తామని ఓవైసీ వ్యాఖ్యానించారు.