శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (16:27 IST)

టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి భేటీ.. హాయిగా కునుకు తీసిన దిగ్విజయ్!

తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాత్రం ఒకవైపు నేతలు మాట్లాడుతుంటే హాయిగా కనుకుతీశారు. దిగ్విజయ్ సింగ్ కంటే తామేమీ తక్కువ తినలేదన్న చందంగా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలైన కె.జానారెడ్డి, వి హనుమంత రావులు కూడా పోటీపడుతూ మరీ కునుకు తీశారు. 
 
ఆ తర్వాత సమావేశం ఆఖర్లో ఆయన ప్రసంగిస్తూ ఇతర ప్రాంతాల వారికి నష్టం కలిగించేలా విభజన చట్టంలో పేర్కొనకపోయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం బాధాకరమన్నారు. మజ్లిస్, బీజేపీలో మత ధోరణితో ఆలోచిస్తాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొడతాయన్నారు. మజ్లిస్ తీరును తాము ఎట్టి పరిస్థితుల్లోను సహించే ప్రసక్తి లేదన్నారు.