గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల కన్నతండ్రే కీచకుడయ్యాడు.. ఎక్కడ?

హైదరాబాద్‌లో మరో అబల అత్యాచారానికి గురైంది. ఈ కేసులో కన్నతండ్రే కీచకుడయ్యాడు. ఈ దారుణం బంజారాహిల్స్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే బాలిక (14) 9వ తరగతి చదువుతోంది. 
 
ఆమెను తండ్రి సయ్యద్ రషీద్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు రోజులు క్రితం బాలిక నిద్రిస్తున్న సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాధిత బాలిక రెండు రోజులుగా బాధను గుండెల్లోనే దాచుకుంది. అయితే, తీవ్ర రక్తస్రావం కావడాన్ని తల్లి గమనించింది. దీంతో కీచక తండ్రి దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
ఆ తర్వాత తల్లి కూతుర్ని తీసుకొని బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి భర్తపై ఫిర్యాదు చేసింది. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.