మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:48 IST)

ఆ ముగ్గురూ ఏపీని పట్టిపీడిస్తున్న రాక్షసులు: గాలి ముద్దుకృష్ణమ

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ మంత్రులపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు ముగ్గురూ ఏపీని పట్టి పీడిస్తున్న రాక్షసులని మండిపడ్డారు.
 
ఇక తెలంగాణ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితల భవితవ్యంపై గాలి ముద్దుకృష్ణమ జోస్యం చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో కేసీఆర్ పదవి నుంచి తప్పుకుంటే కేటీఆర్ గానీ, కవితగానీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇక మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ వాడుకుని వదిలేస్తారని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు.