శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (15:56 IST)

పొన్నాల మాజీ ఐఏఎస్ అధికారి.. నిబంధనలు తెలియవా : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు అసైన్డ్ భూములు తీసుకుని... ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు స్థాపించలేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. పైగా దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇతర కులాల వారు కొనుగోలు చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ.. ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా పొన్నాల ఎలా కొన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. 
 
బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లో ఏపీఐఐసీ వెల్లడించిందని గుర్తు చేశారు. కానీ పొన్నాల మాత్రం ఆ భూములు అప్పగించలేదని విమర్శించారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ.25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ.. విక్రయించడం కానీ చేయకూడదని హరీష్ రావు గుర్తు చేశారు.