మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (10:34 IST)

నమస్తే తెలంగాణ పత్రికలో హెరిటేజ్ ప్రకటన : మండిపడిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి చెందిన 'నమస్తే తెలంగాణ' పత్రికకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోపించారు. 
 
'నమస్తే తెలంగాణ'లో చంద్రబాబుకు చెందిన 'హెరిటేజ్' సంస్థ యాడ్ వచ్చిందని... మరే ఇతర పత్రికలో కూడా ఇంతవరకు హెరిటేజ్ సంస్థ పత్రిక ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. దీన్ని బట్టే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంబంధాలు అర్థమవుతున్నాయని అన్నారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.