శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:55 IST)

జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 16లోపు నిర్వహించాలి : హైకోర్టు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను వచ్చే డిసెంబర్ 16వ తేదీలోపు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధి పద్మనాభ రెడ్డి వేసిన పిటిషన్‌ ఆధారంగా విచారణ జరిపిన కోర్టు సోమవారం ఉదయం ఈమేరకు తీర్పును వెలువరించింది.
 
అక్టోబరు నెల 31లోగా వార్డుల విభజన రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి మరో 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆరు నెలలకు మించి గడువు కావాలని ప్రభుత్వం తరపున లాయర్‌ కోర్టును కోరారు.
 
ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ఉన్నందున అదనపు సమయం ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. 225 రోజుల గడువు ఇస్తున్నామని ఆలోపు ఎలక్షన్స్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.