బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: మంగళవారం, 13 మార్చి 2018 (20:32 IST)

బిర్యానీ చేసి పెట్టలేదని భార్యను తరిమేశాడు... ఇంటి ముందు దీక్ష

సాధారణంగా కొత్తగా వివాహమైనవారు ఏదో చిన్నచిన్న కారణాలతో గొడవలు పడుతుంటారు. చివరకు పెద్దలు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ వారి కాపురాన్ని కలుపుతారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనతో పెద్దలే కాదు పోలీసులు ఆశ్చర్యపోయారు. తన భార్య బిర్యానీ వం

సాధారణంగా కొత్తగా వివాహమైనవారు ఏదో చిన్నచిన్న కారణాలతో గొడవలు పడుతుంటారు. చివరకు పెద్దలు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ వారి కాపురాన్ని కలుపుతారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనతో పెద్దలే కాదు పోలీసులు ఆశ్చర్యపోయారు. తన భార్య బిర్యానీ వండి పెట్టలేదని ఏకంగా తన భార్యను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు భర్త. తెలంగాణా రాష్ట్రం మహబూబ్ నగర్‌లో జరిగింది ఈ సంఘటన.
 
యాదయ్యగౌడ్, అంజలికి నాలుగు నెలల క్రితం పెద్దలు వివాహం చేశారు. మూడు నెలల పాటు వీరి కాపురం బాగానే సాగింది. అయితే ఒక నెలరోజుల నుంచి మాత్రం వీరి కాపురంలో చిచ్చు పెట్టింది బిర్యానీ. భర్త రోజూ రాత్రి ఇంటికి వచ్చిందే భార్యను బిర్యానీ పెట్టమని అడిగేవాడు. రోజూ బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. వారానికి ఒకసారి మాత్రమే చేస్తానని చెప్పింది భార్య అంజలి. 
 
దీంతో కోపంతో ఊగిపోయిన యాదయ్యగౌడ్ ఆమెను ఇంట్లో నుంచి పంపేశాడు. పెద్దలు పంచాయతీ పెట్టినా, పోలీసులు హెచ్చరించినా సరే తనకు బిర్యానీ చేసి పెడితేనే భార్యను ఇంట్లోకి అనుమతిస్తానంటూ మొండిపట్టు పట్టాడు. దీంతో అతడి భార్య, భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగింది. ఈ విషయం కాస్తా అలాఅలా స్థానికులకు తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారట.