తెరాసలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది.
త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అనుమతించవద్దంటూ టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వేర్వేరుగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు వీటిని తోసిపుచ్చింది.
ఇలాంటి సమయంలో ఈ పిటీషన్పై తాము జోక్యం చేసుకోలేమని పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్రెడ్డి, కనకయ్య తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని స్పష్టం చేసింది.