హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణం!
హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ మనోముక్తు మానవ్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీస్ అకాడమీ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న మను ముక్తి మానవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
పోలీస్ అకాడమీ అధికారులు మను ముక్తి మానవ్ వెంటనే బంజారా హిల్స్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మను ముక్తి మానవ్ మరణించాడు. మను ముక్తి మానవ్ హిమాచల్ ప్రదేశ్ బ్యాచ్ కింద ఐపీఎస్కి సెలక్టయ్యాడు.