ఐపీఎస్ ట్రైనింగ్ కేంద్రంలో మను ముక్త్ మానవ్ను హత్య చేశారా?
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడెమీలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మానవ్ ఈత కొడుతూ అదుపుతప్పి పడిపోవడం వల్లే మానవ్కు తీవ్రమైన గాయాలు తగలడంతో మరణించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విపరీతంగా తాగి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం వల్ల మరణించాడని వార్తలు వచ్చాయి.
అయితే, మానవ్ మృతి విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. తాజాగా ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ని చంపేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మను ముక్త్ మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ తన కుమారుడిని ఎవరో చంపేశారని ఆరోపిస్తున్నారు. తన కుమారుడి మృతి మీద సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు.