గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:10 IST)

పొన్నాలపై టీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. గోచీ ఊడకొడతారంటూ...

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలే తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గోచీ ఊడగొట్టడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే కనీస అర్హత పొన్నాలకు లేదన్నారు. 
 
త్వరలో పొన్నాల లక్ష్మయ్య గోచీని కాంగ్రెస్ వాళ్లే ఊడగొడతారన్నారు. కేసీఆర్‌ను ప్రజలు తరిమి కొడతారని పొన్నాల అంటున్నారని... వాస్తవానికి కాంగ్రెస్ కార్యకర్తలే పొన్నాల గోచీ ఊడగొట్టేందుకు రెడీ అవుతున్నారని ఆయన హెచ్చరించారు. 
 
కేసీఆర్‌ తన వందరోజుల పాలనలో ఏ అభివృద్ధీ చేయలేదని ఆరోపిస్తున్న పొన్నాల... తన రాజకీయ జీవితం ఆసాంతం... ఆంధ్రావాళ్ల కాళ్లు మొక్కి పదవులు కాపాడుకున్నాడని వ్యాఖ్యానించారు.