మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:18 IST)

అద్వానీని గెంటేసి.. జగ్గారెడ్డిని ఆహ్వానించారు : హరీష్ రావు

అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. 
 
ఇప్పటికే మెదక్‌లో ప్రజలు తమకు పట్టం కట్టారని, అది కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వవద్దన్న జగ్గారెడ్డిని కాంగ్రెసు పార్టీ నుంచి తీసుకొని బీజేపీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చారని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడించారని గుర్తు చేశారు. బీజేపీ తీరు విచిత్రంగా మారిందని, పార్టీ కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర చేసిన అద్వానీని జాతీయ స్థాయిలో పక్కకు పెట్టారని, క్షేత్రస్థాయిలో బీజేపీ కోసం పని చేసిన వారిని కాదని జగ్గారెడ్డి వంటి వారిని చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు.