శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (11:14 IST)

టి అసెంబ్లీలో మీడియాకు నో ఎంట్రి.. తరిమికొడుతున్న పోలీసులు!

తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షల అమల్లోకి వచ్చాయి. దీంతో సచివాలయంలో ఉన్న జర్నలిస్టు ప్రతినిధులను భద్రతా సిబ్బంది తరిమికొడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ-బ్లాక్‌ (సమతా బ్లాక్‌)లోకి జర్నలిస్టులు అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. 
 
సోమవారం మధ్యాహ్నం సీపీఆర్‌వో గదిలో కూర్చున్న జర్నలిస్టులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి పంపించేశారు. మీడియాను అనుమతించవద్దని పౌరసంబంధాల అధికారి తమను ఆదేశించారని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) సూచించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ బయటికి వచ్చారు. 
 
సీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మంత్రుల కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. దీంతో జర్నలిస్టుల ఆందోళన విషయం తెలిసిన సీఎంపీఆర్వో కార్యాలయ అధికారులు బయటకు వచ్చి మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని, వారిని లోనికి రావాలని సూచించగా... దీనికి మీడియా ప్రతినిధులు నిరాకరించారు. ఈ విషయంపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు.