శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (10:07 IST)

పవన్ కళ్యాణ్ ఓ టూరిస్టుగానే ఉండాలనుకుంటున్నారు : కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు అదించేందుకు నిరాకరించిన జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్‌పై టీ సీఎం కె చంద్రశేఖర్ రావు స్పందించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని... కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని అని చెప్పారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మని ఆయన ఘాటుగా కామెంట్ చేశారు.
 
కాగా, భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందన్నారు. సర్వేలో భాగంగా సామాన్య ప్రజలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినీరాజకీయ ప్రముఖులు కూడా సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్, విజయశాంతి వంటి వారు ఈ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెల్సిందే.