శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (19:59 IST)

ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. హైదరాబాదీలంతా మా బిడ్డలే: కేసీఆర్

వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి రికార్డు విజయాన్ని ఇచ్చిన జంటనగరాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్ననని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాదీలంతా తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అందరూ పిడికిలెత్తి గెలిపించారని.. అందరికీ ధన్యవాదాలని చెప్పారు. విజయం సాధించిన అందరికీ అభినందనలని తెలిపారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతవరకు 50 స్థానాలను కట్టబెట్టిన దాఖలాలు లేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంత అద్భుతమైన విజయం చేకూర్చిపెట్టారని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న వారంతా హైదరాబాదీలే.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు ఆంధ్రా ప్రాంత సోదరులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీరందరికి రక్షణ కల్పిస్తామని ఉద్ఘాటించారు. ఏ ఒక్కరు అభద్రత భావానికి లోను కాకూడదని చెప్పారు.