శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 28 జనవరి 2016 (20:16 IST)

చైనా వాళ్లు కప్పల్ని, పాముల్ని తింటారు... ఐనా 'బీఫ్'పై ఏందిర భాయ్... కేసీఆర్ ప్రశ్న

తినే పదార్థాలపైనా రాజకీయం చేస్తూ మాట్లాడటం దౌర్భాగ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చైనా వాళ్లు కప్పల్ని, పాముల్ని పట్టుకుని తింటారనీ, ఐనా ఎవరికిష్టం వచ్చింది వాళ్లు తింటారనీ, దీనిపైన కూడా రాజకీయం ఏంటీ, ‘బీఫ్’పై రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యమని అన్నారు.
 
‘బీఫ్’ ఒక అంశంగా చేస్తూ రాజకీయ పార్టీ వెళ్లడమే దిక్కుమాలినతనమన్న ఆయన ఎవరికి అందుబాటులో ఉండే ఆహారాన్ని వారు తీసుకుంటున్నారని.. అదేవిధంగా బీఫ్‌ను కొంతమంది ఆహారంగా తీసుకుంటారని అన్నారు. అసలు, బీఫ్ పైన ప్రశ్నించడం అనవసరమన్న కేసీఆర్ ఈ ప్రశ్నకు తలాతోక లేదని చెప్పారు. మొత్తానికి ఓ పార్టీ బీఫ్ గురించి మాట్లాడితే దాని గురించి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.