మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (20:28 IST)

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను వాడుతారట కేసీఆర్

హైదరాబాద్ నగరాన్ని వైఫై సిటిగా చేయడానికి కంకణం కట్టుకున్నారు కేసిఆర్. త్వరలో హైదరాబాద్‌తోపాటు తెలంగాణా ప్రధాన నగరాల్లో 4జి సేవలు అందుబాలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ట్విట్టర్లో ట్వీట్స్ చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఆయా అంశాలపై వ్యాఖ్యలు చేస్తారు. దీనివల్ల నిత్యం ప్రతి అంశంపై మీడియా ముందుకు వచ్చి స్పందించవలసిన అవసరం ఉండదు. అలాగే ఫేస్‌బుక్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వం చేపడుతున్న వివిద కార్యక్రమాలను తెలియచేస్తుంది. 
 
అంతేకాక తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా, వారి నుంచి సలహాలను తీసుకోవడానికి కూడా దీనిని వాడుకోబోతున్నారు. తద్వారా తెలంగాణ ప్రజలతో ఇంటరాక్ట్ కావాలని సిఎమ్ నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ కాలంలో దానిని తాను వాడుకోవడానికి కెసిఆర్ సిధ్ధమవుతున్నారు.