గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (14:38 IST)

దిగ్విజయ్ సింగ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మస్లీస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎంఐఎంకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అండతోనే మేయర్ పదవిలో ఎంఐఎం కొనసాగుతుందనే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ జ్ఞప్తికి తెచ్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. 
 
ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీకి దిగుతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.