గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (14:43 IST)

రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలి: కోమటిరెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని నానా విధాలుగా వేధిస్తోందన్నారు. 
 
కరెంటు బిల్లులను చెల్లించలేదనే సాకు చూపి, రైతుల మోటార్లను, స్టార్టర్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా రైతులను ఇదే విధంగా వేధించారని... కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో తుది దశలో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లను విడుదల చేయాలని కోరారు.
 
ఇదిలా ఉంటే.. మెదక్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తొగుట మండలం వేములఘాట్‌లో రైతు కిష్టయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.