తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే: కమిషనర్ రేమండ్ పీటర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను రీ సర్వే చేయనున్నట్టు ఆ రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు రీ సర్వే చేయిస్తామని చెప్పారు.
భూముల రీ సర్వే కోసం కావాల్సిన పూర్తి నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిజామాబాద్లో ఇప్పటికే సర్వే పూర్తి చేశామన్నారు. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ భూ సర్వే విధానం - ల్యాండ్ రికార్డు ఆధునిక పద్ధతులు అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన పైవిషయాలను వెల్లడించారు.