మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (16:26 IST)

కేసీఆర్ తాగి మాట్లాడుతున్నారా? మగాడైతే నిలబడాలి: యాష్కీ సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులని, చిప్పకూడు తింటారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నే

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులని, చిప్పకూడు తింటారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి రాబందుల పార్టీ అని.. తెరాస నేతలు చదువురాని మూర్ఖులంటూ విమర్శలు గుప్పించారు. 
 
కేసీఆర్ సవాల్ చేసి పారిపోవడం కాదని.. మగాడైతే నిలబడాలని సవాల్ విసిరారు. కేసులు పెట్టి చిప్పకూడు తినిపిస్తామన్న కేసీఆర్ బెదిరింపులకు ఏమాత్రం భయపడే ప్రసక్తే లేదని యాష్కీ స్పష్టం చేశారు. కేసీఆర్ తాగి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
 
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని దగా ఒప్పందంగా అభివర్ణించిన మధుయాష్కి మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. మరో సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలులో పెట్టి చిప్పకూడు తినిపిస్తానని కేసీఆర్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు.