శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (11:42 IST)

అనుమానం పెనుభూతం : భార్య ముక్కు చెవులు కోసిన భర్త!

వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారంలో భర్త అనుమానం పెనుభూతమైంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమె ముక్కు, చెవులను కోసివేశాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధాపురంకు చెందిన రజిత, శ్రీనివాస్ అనే దంపతులు ఉన్నారు. భార్య రజితపై భర్త శ్రీనివాస్‌కు గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. 
 
తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. కోసిన ముక్కు, చెవిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నారు.