శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (15:08 IST)

లక్షలాది కట్నం తీసుకున్నాడు.. యువతిని మోసం చేశాడు.. అప్పటికే మూడు పెళ్ళిళ్లు!

పెళ్ళి పేరుతో మహిళల్ని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బడా వ్యాపారి అని నమ్మించి మూడో పెళ్లి కూడా చేసుకున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షలాది రూపాయల కట్నం తీసుకుని యువతిని పెళ్ళాడిన అతనికి మూడు పెళ్ళిళ్లు అయ్యాయని లేటుగా తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాముంటున్న యువతి(19)ని పాతబస్తీలో వ్యాపారినంటూ నమ్మించిన సయ్యద్ యాసిర్ అహ్మద్(21) అనే యువకుడు గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు. కట్నం కింద రూ.30 లక్షలు, బంగారాన్ని తీసుకున్న యాసిర్.. కొంతకాలం అత్తారింటిలోనే ఉన్నాడు. తర్వాత ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని వేరే కాపురం పెట్టాడు. 
 
భార్యను ఇంట్లోనే బంధించి బయటకు వెళ్లేవాడు. భరించలేక ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అప్పటికే అయ్యగారి బండారమంతా ఆ యువతికి తెలిసిపోయింది.  ఆపై బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై 498ఏ,420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.