శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (10:38 IST)

మెదక్ ట్రైన్ యాక్సిడెంట్ : తరుణ్, వైష్ణవి కన్నుమూత

మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఇద్దరు విద్యార్థులు తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం చిన్నారి తరుణ్ మృతి చెందగా, మంగళవారం తెల్లవారుజామున 11 ఏళ్ల వైష్ణవి తుది శ్వాస విడిచినట్లు ఆ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. 
 
తరుణ్ తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి శరీరం వైద్యానికి సహకరించలేదు. అలాగే చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని సోమవారమే వైద్యులు ప్రకటించగా, మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదచాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాసాయిపేట రైలు ప్రమాద మృతుల సంఖ్య 18కు చేరింది.