గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 మే 2015 (14:22 IST)

తండ్రిని కొట్టి, రంగారెడ్డిలో 9వ తరగతి విద్యార్థినిపై ఐదుగురు గ్యాంగ్ రేప్, హత్య

అమ్మాయి ఒంటరిగా ఉంటే అఘాయిత్యాలు జరుగుతాయని ఇదివరకు భయపడేవారు. ఇప్పుడు తోడుగా మరో మనిషి ఉన్నా అతడిని చావబాదేసి అమ్మాయిలను ఎత్తుకెళ్లి తమ లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నారు కామాంధులు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఇది. జిల్లాలోని బంట్వారం మండలం బారువాడలో 13 ఏళ్ల బాలికను ఆటోలో వచ్చిన ఐదుగురు దుండగులు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమెను హత్య చేశారు. 
 
తొమ్మిదో తరగితి చదువుతున్న కుమార్తె, ఆమె తండ్రి ఇద్దరూ ఆటోలో వెళ‌్తూ మంచినీటి కోసం ఆగారు. తండ్రి మంచినీళ్లు తెచ్చేందుకు కిందికి దిగగా ఆ వెంటనే తండ్రీ నుంచి బాలికను ఐదుగురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తండ్రి అడ్డగించినా అతడి తలపై బండరాయితో కొట్టి బాలికను తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను హతమార్చారు. 
 
తన కుమార్తెను దుండగులు ఎత్తుకెళ్లారన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్య చేపట్టారు. ఐతే ఆ బాలికపై అత్యాచారం జరిపిన దుండగులు ఆమెను హతమార్చినట్లు కనుగొన్నారు. ఆ ఐదుగురు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.