బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (07:46 IST)

కసాయి అమ్మ... ముగ్గురు పిల్లలు హత్య.. ఆపై సూసైడ్ అటెంమ్ట్!

మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లి చేసిన ఘాతుకానికి ఆ ముగ్గురు పిల్లలూ చనిపోగా, ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన ఆ కసాయి తల్లిని మాత్రం స్థానికులు గుర్తించి కాపాడారు. 
 
అయితే, ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు చెన్నమ్మ (5), కుమార్ (3), రాణి (2) అనే తన ముగ్గురు పిల్లలను గొంతునులిమి హత్య చేసింది. ఆర్థిక కష్టాలతో పాటు.. అత్త దూషించడం, తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆ కసాయి తల్లి పోలీసులకు వివరించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.