శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (11:11 IST)

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ మర్మాంగంపై వాతలు పెట్టి.. మూత్రం తాగించిన తల్లి..

భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి

భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగారెడ్డి టౌన్‌కు చెందిన మురళీకృష్ణ- అనూషలకు 2005లో వివాహమైంది. వీరికి విష్ణువర్ధన్ (11), హర్షవర్ధన్ (9) అనే ఇద్దరు కుమారులు వున్నాయి. 
 
ఈ దంపతుల మధ్య ఏర్పడిన విబేధాలు.. విడిపోవడానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో అనూష తన కుమారులతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆపై ఓ వడ్డీ వ్యాపారితో కలిసి రాజీవ్‌గాంధీ నగర్‌లో మకాం పెట్టింది. అయితే పిల్లలు మాత్రం తండ్రివద్దకు వెళ్తామని మారాం చేయడంతో చిత్రహింసలు మొదలుపెట్టింది.
 
తండ్రి వద్దకు వెళ్తానని చెప్పిన కుమారుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. అంతటితో ఆగకుండా రెండో భర్త మూత్రం తాగించింది. వారం రోజుల క్రితం గాజులరామానికి మకాం మార్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి అనూషపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.