శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (18:19 IST)

నరేంద్ర మోడీ భారతంలో ఏకలవ్యుడు... శశి థరూర్ పుస్తకావిష్కరణలో ఎంపీ కవిత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ఇండియా శాస్త్ర అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ పుస్తకాన్ని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిశాక కల్వకుంట్ల కవిత రచయిత శశి థరూర్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. 

 
వాటిలో ఒకటి... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మహాభారతంలో ఏ పాత్ర సరిపోలుతుందన్నది. దానికి శశి బదులిస్తూ... ఏకలవ్యుడి పాత్ర సరిపోతుందని చెప్పారు. మరి ఏ ప్రకారం ఏకలవ్యుడితో పోల్చారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు భాజపాకు దగ్గరవుతున్నారనుకున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ను ప్రధాని ఎలాంటి పాత్రకు సరిపోతారని ఆమె అడగటం గమనార్హం. కాగా ఈ కార్యక్రమానికి ఆమెతోపాటు కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, సినీనటి మంచులక్ష్మి కూడా హాజరయ్యారు.