శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:54 IST)

కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు : నాయిని నర్సింహా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి నారాయణపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాలేజీలు స్థాపించి.. భారీ మొత్తంలో తెలంగాణ పైసలను కుమ్ముతున్నడంటూ వ్యాఖ్యానించాడు. 
 
టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ సామాన్య ఆంధ్రా ప్రజలతో తమకెలాంటి ఇబ్బంది లేదని నాయిని చెప్పగా... మరి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెళ్లగొడతామని ఎందుకన్నారంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. 
 
దీంతో ఒక్కసారిగా గొంతు సవరించుకున్న నాయిని ‘‘అట్లెవరన్నరు? వారెవ్వా... వస్తాద్ ఏం ఉన్నవ్. నారాయణ (ఏపీ మంత్రి) ఇక్కడ కాలేజీలు పెట్టి తెలంగాణ పైసలు కుమ్ముతున్నడు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నడు. రేపు తెలంగాణ వాళ్లు కాలేజీలు పెట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేసినా నియంత్రిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.