గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 20 జులై 2014 (17:42 IST)

అడుగుపెడితే కొడతాం : టీ మంత్రులకు ఓయూ స్టూడెంట్స్ వార్నింగ్!

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడుగుపెడితే మంత్రులని కూడా చూడకుండా తరిమి కొడతామని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఆ యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అంశంపై ఆందోళనకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఆదివారం కూడా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం కూడా కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణను నిరసిస్తూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిని సముదాయించేందుకు వెళ్లిన మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రులను అడ్డుకుని వాగ్వాదానికి దిగడంతో అక్కడ కాసేపు ఉధ్రిక్తత ఏర్పడింది. 
 
ఆదివారం నాటి ఆందోళనలో భాగంగా తార్నాక వైపు దూసుకెళుతున్న విద్యార్థులను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే, ఖాళీ పోస్టులన్నీ భర్తీ కావడంతో తమకు అసలు ఉద్యోగాలే దక్కని స్థితి నెలకొనే ప్రమాదముందని ఓయూ విద్యార్థులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ సంసిద్ధతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.