శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (09:36 IST)

రెండేళ్ళలో కేసీఆర్ సర్కారు కూలిపోతుంది : పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

ఖచ్చితంగా చెపుతున్నా... మరో రెండేళ్ళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చెపుతున్న మాటలకు, చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన మాటలు కోటలుదాటాయని, తీరా సీఎం కుర్చీలో కూర్చోగానే అన్ని మరచిపోయి తన ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 
 
ఇకపోతే టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు భారీగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్లు, పరిశ్రమల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని... ఆయన సోదరుడు కలెక్షన్ ఏజంటుగా మారారని పాల్వాయి ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి అవినీతి వెనుక మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సాహం ఉందని మండిపడ్డారు.