శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (16:33 IST)

జగ్గారెడ్డికి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్ : రంగంలోకి వెంకయ్య - చంద్రబాబు!

కోటి ఆశలతో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు. 
 
సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగ్గారెడ్డి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలు లేనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెన్నునొప్పి కారణంగా పవన్ కళ్యాణ్ బెంగుళూరులో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
ఈ విషయాన్ని జగ్గారెడ్డికి పవన్ స్వయంగా ఎస్ఎంఎస్ ద్వారా వెల్లడించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు, వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు. వీరిద్దరు పవన్‌తో సంప్రదింపులు జరపడమే కాకుండా, స్వయంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుడా, జగ్గారెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ అధినేత అమిత్ షా, కేంద్ర మంత్రులను రంగంలోకి దించనున్నారు.