శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (14:22 IST)

సమగ్ర సర్వేకు వివరాలివ్వని పవన్ కళ్యాణ్ - విజయశాంతి!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సర్వేలో తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, సామాన్యులు అందరూ ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేస్తున్నారు. అయితే, జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సర్వేకు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వలేదు. అయితే, వారి నుంచి వివరాలను తీసుకోవడానికి మరోసారి ప్రయత్నిస్తామని ఎన్యూమరేటర్లు తెలిపారు. 
 
ఇదిలావుండగా, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పూర్తి వివరాలు ఇచ్చినట్టు ఎన్యూమరేటర్లు వెల్లడించారు. అలాగే, హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర సీమాంధ్ర ప్రాంత రాజకీయ నేతల్లో పలువురు ఈ సర్వేకు సంబంధించిన వివరాలను అందజేశారు.