శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 28 ఆగస్టు 2014 (18:02 IST)

పవన్ కళ్యాణ్ ను రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీ వార్నింగ్

సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ప్రచారం చేసే అవకాశం వుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓయూ(ఉస్మానియా) జేఏసి మరోసారి మండిపడింది. పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతు పలుకుతూ తన జనసేన పార్టీ ద్వారా ముందుకు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌ని రాళ్లతో కొడతారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారనీ, మెదక్ లో జగ్గారెడ్డికి ప్రచారం చేస్తే ప్రజలు మరోసారి గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. కాగా దీనిపై భాజపాపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొత్తమ్మీద మెదక్ పార్లమెంటు స్థానంపై పోటీ రసకందాయంలో పడింది.