గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (12:48 IST)

దత్త పుత్రికలతో వ్యభిచారం: తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడ?

దత్త పుత్రికలతో వ్యభిచారం చేయించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమను భద్రంగా పెంచుతారనుకున్న.. ఆ అమ్మాయిలకు వేధింపులే మిగిలాయి. వారి వేధింపులకు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పెంపుడు తండ్రిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10కి చెందిన పద్మ, రమేష్‌కు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడు రమేష్‌ గుండెపోటుతో చనిపోయాడు. పద్మ కల్లుకు బానిసై గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది కాలానికి ఆమెకు మతిస్థిమితం తప్పడంతో కుమార్తెలను గోవిందు, అతడి భార్య లక్ష్మి పెంచుకుంటున్నారు. యుక్త వయస్సు వచ్చాక వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారు.
 
డబ్బు వసూలు చేస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక పెద్ద కుమార్తె వారం రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. గోవిందు బంజారా హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి యువతిని కనిపెట్టి విచారణ జరిపారు. ఈ విచారణలో బాధితురాలు జరిగిందంతా చెప్పేసింది. పెంపుడు తల్లిదండ్రుల తమతో వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడించింది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు గోవిందును అరెస్టు చేసి లక్ష్మిపై కేసు నమోదు చేశారు.